ఆంధ్రప్రదేశ్,తిరుమల, ఫిబ్రవరి 1 -- స్థానిక కోటా టికెట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అలర్ట్ ఇచ్చింది. ఈ కోటా దర్శనాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు తెలిపింది. ఈనెల మొదటి మంగళవారమైన 4వ తేది రథసప్తమి పర్వదినం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో మంగళవారమైన 11వ తేదికి స్థానిక కోటా దర్శనాలను మార్పు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్, తిరుపతిలోని మహతీ ఆడిటోరియంలో 9వ తేది ఆదివారం టోకెన్లను జారీ చేస్తారని వెల్లడించింది. స్థానికులు ఈ మార్పును గమనించి టోకెన్లు పొందాలని విజ్ఞప్తి చేసింది. ప్రతినెలా మొదటి మంగళవారం తిరుమల, తిరుపతి స్థానికులకు టీటీడీ స్థానిక కోటాలో దర్శనాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 4వ తేది రథసప్తమి(సూర్య జయంతి) సందర్భంగా తిరుమలలో వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.