తిరుమల,ఆంధ్రప్రదేస్, డిసెంబర్ 29 -- వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2025 జనవరి 10 నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. జనవరి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు ఈ అవకాశం ఉంటుంది. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని ఆలయన ఈవో జె.శ్యామల రావు తెలిపారు.

తిరుమల అన్నమయ్య భ‌వ‌నంలో శనివారం నిర్వ‌హించిన డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో ఈవో మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. అన్నిరకాల ప్రివిలేజ్డ్‌ దర్శనాలు రద్దవుతాయని చెప్పారు. ఈవో చెప్పిన ముఖ్య విషయాలు ఇక్కడ చూడండి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....