భారతదేశం, ఫిబ్రవరి 12 -- ఫిబ్రవరి 15న మహా శివరాత్రిని దృష్టిలో ఉంచుకుని శైవ క్షేత్రాలకు ప్రయాణికులను తీసుకెళ్లేందుకు 2,243 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రకటించింది. తెలంగాణలోని 43 శైవ క్షేత్రాలకు ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఈ బస్సులు ఉపయోగపడతాయి. ఫిబ్రవరి 14 నుండి 16 వరకు రెండు రోజుల పాటు ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది.

మొత్తం బస్సులలో 781 ప్రత్యేక బస్సులు శ్రీశైలానికి, 416 వేములవాడకు, 249 ఏడుపాయలకు, 326 కీసరగుట్టకు, 127 వేలాలకు, 71 కాళేశ్వరానికి, 273 కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, ఇతర దేవాలయాలకు నడిపిస్తారు.

హైదరాబాద్ నగరం నుండి ప్రయాణించే ప్రయాణికులు మహాత్మా గాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ...