భారతదేశం, ఫిబ్రవరి 23 -- ఉద్యోగ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) అప్‌డేట్ చేసుకునే గడువును మార్చి 25వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.

అభ్యర్థులు తప్పకుండా వారి వివరాలను నమోదు చేసుకోవడానికి ఇదే చివరి అవకాశమని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. తర్వాత మళ్ళీ గడువు పొడిగించే ప్రసక్తే లేదని పేర్కొంది. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లో నింపే సమాచారానికి ఓటీఆర్ డేటానే ప్రాథమిక ఆధారం అవుతుందని పేర్కొంది. https://www.tgpsc.gov.in ద్వారా అప్డేట్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని సూచించింది.

తప్పనిసరిగా కొత్త కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంబంధిత సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అదనపు విద్యార్హతలు, చిరునామా , ఈడబ్యూఎస్, నాన్-క్రీమీ లేయర్ , మొబైల్ నంబర్ మరియు...