భారతదేశం, జనవరి 24 -- కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇకపై రిజిస్ట్రేషన్ బాధలు తప్పనున్నాయి. చాలా సులభంగా డీలర్ షోరూమ్ వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఈ సరికొత్త విధానం రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి (జనవరి 23) నుంచి అమల్లోకి వచ్చింది.

షోరూమ్ లోనే రిజిస్ట్రేషన్ల నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖలో మరిన్ని సంస్కరణలు అమలుకానున్నాయి. గతంలో వాహన కొనుగోలుదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను(టీఆర్‌) డీలర్‌ వద్ద చేసుకునే వారు. శాశ్వత రిజిస్ట్రేషన్‌కు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. నేటి నుంచి షోరూమ్ డీలర్ల వద్దనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. కొత్తగా వాహనం కొన్న వాహనదారుడు రిజిస్టేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం ఉండదు.

వాహనాన్ని విక్రయించిన డీలరే...