భారతదేశం, మార్చి 18 -- TG SSC Exams 2025 : తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్ఎస్సీ-2025 వార్షిక పరీక్షలను 21.03.2025 నుంచి 04.04.2025 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2650 పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్ష డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.

పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహిస్తారు.

a. ఫస్ట్ లాంగ్వేజ్ (కాంపోజిట్ కోర్సు) సమయం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు.

b. సైన్స్ సబ్జెక్టు విషయంలో రెండు భాగాలు ఉంటాయి. అంటే పార్ట్-I ఫిజికల్ సైన్స్, పార్ట్-II బయోలాజికల్ సైన్స్. వీటిని ఉదయం 9.30 నుండి ఉదయం 11.00 వరకు రెండు వేర్వేరు రోజులలో నిర్వహిస్తారు.

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 11,547 పాఠశాలల నుంచి మొత్తం 5,09,403 మంది (బాలురు: 2,58,895, బాలికలు: 2,50,508) విద్యార్థులు ...