తెలంగాణ,హైదరాబాద్, మార్చి 29 -- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం "రాజీవ్ యువ వికాసం" పథకాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ స్కీమ్ ను తీసుకువచ్చారు. రూ. ఆరు వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఈ స్కీమ్ ను లాంఛనంగా ప్రారంభించగా.... అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఈ స్కీమ్ కోసం ఆన్లైన్ దరఖాస్తుకు ఏప్రిల్ 5ను తేదీ గడువుగా నిర్ణయించారు. ఏప్రిల్ 6 నుంచి 20 వరకు మండలస్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తిచేసి జిల్లాస్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి. జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి మే 21 నుంచి 31 వరకు మంజూరు చేస్తాయి. జూన్ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.