తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 2 -- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం "రాజీవ్ యువ వికాసం" పథకాన్ని తీసుకువచ్చింది. యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ స్కీమ్ ను ప్రారంభించారు. రూ. ఆరు వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఈ స్కీమ్ ను లాంఛనంగా ప్రారంభించగా.... అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కేవలం ఆన్ లైన్ లో మాత్రమే కాకుండా... ఆఫ్ లైన్ విధానంలో కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

ఇటీవలే దరఖాస్తుల గడువు ముగియగా... ఈ గడువును ఏప్రిల్‌ 14 వరకు పొడిగించారు. ఆ తర్వాత మండలస్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తిచేసి జిల్లాస్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి. జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి యూనిట్లను మంజూరు చేస్తాయి. జూన్‌ 2 నుంచి 9 వరకు ...