భారతదేశం, మార్చి 25 -- ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా.. దానికి రేషన్ కార్డు ఉండాలనే షరతు విధిస్తోంది. ఫలితంగా వేలాది మంది లబ్ధి పొందలేకపోతున్నారు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాసం స్కీమ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. రేషన్ కార్డులో పేరు లేని కారణంగా చాలామంది దరఖాస్తు చేసుకోవడం లేదు. కొత్త కార్డు కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండటం లేదు. దీంతో చాలామంది నష్టపోతున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. చాలామందికి పెళ్లిళ్లు అయ్యాయి. దీంతో నూతన జంటలు తమతమ కుటుంబాలకు రేషన్ కార్డుల్లో పేర్లు తొలగించుకున్నారు. కొత్త కార్డుల కోసం అప్లై చేశారు. కానీ అవి ఇప్పటివరకు రాలేదు. గత ప్రభుత్వంలో వీటి ఊసే లేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజా పాలనలో దరఖాస్తులు స్వీకరించింది. మళ్లీ మీసేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పి...