భారతదేశం, మార్చి 31 -- TG Rajiv Yuva Vikasam : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. 'రాజీవ్ యువ వికాసం' పథకం గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 4తో దరఖాస్తులు ముగియనున్నాయి. పలువురి విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ పథకంలో భాగంగా 5 లక్షల మందికి రూ.6 వేల కోట్ల రుణాలను 60-80 శాతం సబ్సిడీతో ఇవ్వనున్నారు. రేషన్ కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, ఫొటోతో https://tgobmms.cgg.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నిరుద్యోగ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం 'రాజీవ్‌ యువ వికాసం' పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తుంది. తాజాగా దరఖాస్తుల గడువును ఏప్రిల్‌ 14 వరకు పొడిగించారు. ఈ స్కీమ్ అమలు తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో వీడియో కాన్ఫరెన...