భారతదేశం, మార్చి 14 -- తెలంగాణలో రేషన్‌ కార్డులు రెండు రకాలుగా ఉంటాయని.. పౌరసరఫరాలు, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వివరించారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్‌ కార్డులు.. ఎగువన ఉన్నవారికి ఏపీఎల్‌ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇప్పుడు ట్రైకలర్‌లో బీపీఎల్‌ కార్డులను, గ్రీన్‌ కలర్‌లో ఏపీఎల్‌ కార్డులను పంపిణీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు.

తెలంగాణలో 2.8 కోట్ల మంది రేషన్‌కార్డుల లబ్ధిదారులుగా ఇప్పటికే ఉన్నారని.. మంత్రి ఉత్తమ్ చెప్పారు. అర్హులందరికీ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఇస్తుందని స్పష్టం చేశారు. కార్డుల తయారీ సంస్థ ఎంపిక కోసం టెండర్లు పిలిచామని.. ఆ ప్రక్రియ నెలాఖరులోగా అయిపోతుందని వివరించారు. కొత్త రేషన్‌ కార్డుల జారీ ఏప్రిల్‌లో ఉండొచ్చని చెప్పారు.

కొత్త వారితోపాటు ఇప్పటికే కార్డులున్న వారికి కూడా.. స్మ...