భారతదేశం, ఫిబ్రవరి 11 -- మహబూబ్‌నగర్ లోని 45వ డివిజన్ 5వ బూత్‌లో పోలింగ్ నిలిచింది. సింబల్స్ తారుమారు కావడంతో బ్రేక్ పడింది. పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళనకు దిగారు.

ఎన్నికల సంఘం రూపొందించిన టీ- పోల్‌(Tpoll) యాప్‌లోకి వెళ్లి ఓటర్‌ గుర్తింపు కార్డు(ఎపిక్‌) నంబరు సాయంతో స్లిప్పులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఓటర్ల సహాయం కోసం 92400 21456 నంబరుతో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు.

ఈ ఎన్నికల కోసం 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1900 సమస్యాత్మక, 1400 అత్యంత సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. సీసీటీవీ మానిటరింగ్‌తో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్‌ ప్రాంతాల్లో బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.

ఫలితాల వెల్లడి తర్వాత పట్టణ స్...