భారతదేశం, ఫిబ్రవరి 11 -- మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ మందకొడిగా సాగుతోందని ఎస్‌ఈసీ రాణికుముదిని చెప్పారు. వందశాతం వెబ్‌ కాస్టింగ్‌తో పోలింగ్‌ జరుగుతోందని తెలిపారు. సాయంత్రానికి పోలింగ్‌ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఓటర్లు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. చెదురుమదురు ఘటనలు తప్ప ఎలాంటి సమస్యలు లేవని రాణికుముదిని చెప్పారు.

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 వరకు 48.54 శాతం పోలింగ్ నమోదైంది.

సాయంత్రం 5 గంటలతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. ఈ సమయంలోపు క్యూ లైన్లలో నిలబడిన వారికి ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 13వ తేదీన ఉంటుంది.

పోలింగ్ రోజు ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి పొన్నం కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులను ఏ విధ...