భారతదేశం, ఫిబ్రవరి 12 -- రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రేపు (ఫిబ్రవరి 13, 2026) ఉదయం 8 గంటలకు నిర్దేశిత కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు సిద్ధం చేసింది.

కౌంటింగ్ కోసం అవసరమైన సూపర్ వైజర్లు, అసిస్టెంట్లను నియమించారు. శాంతిభద్రతల పరిరక్షణకు కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు.. కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 (నిషేధాజ్ఞలు) అమలు చేస్తారు.

కౌంటింగ్ హాల్ లోపలికి కేవలం సూపర్ వైజర్లు, అసిస్టెంట్లు, అభ్యర్థులు, వారి ఎలక్షన్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. వీరందరూ తప్పనిసరిగా జారీ చేసిన పాసులు కలిగి ఉండాలి. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి అనుమతించరు. స్ట్రాంగ్ రూమ్‌ల వెలుపల వెబ్‌కాస్ట...