తెలంగాణ,కరీంనగర్, ఫిబ్రవరి 7 -- కరీంనగర్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - మెదక్ పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. పట్టభద్రుల స్థానానికి శుక్రవారం కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులతోపాటు 30 మంది నామినేషన్ లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ వేశారు.

నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి అప్పగించారు. అటు బిజేపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన్నమైల్ అంజిరెడ్డి నామినేషన్ వేశారు. ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీష్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, బిజేపి జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. బిఆర్ఎస్ టికెట్ ఆశించిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ స్వ...