తెలంగాణ,హైదరాబాద్, మార్చి 5 -- తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ షురూ అయింది. మార్చి 29 నాటికి మండలిలో ఐదు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వీరిలో మహమూద్‌ అలీ,ఎగ్గె మల్లేశం, సత్యవతి రాథోడ్‌, శేరి సుభాష్‌రెడ్డి, మీర్జా రియాజుల్‌ హాసన్‌ ఉన్నారు. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు మార్చి 20వ తేదీన పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రావటంతో... అధికార పార్టీనే కాదు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా సిద్ధమవుతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సంఖ్యా బలం పరంగా చూస్తే... వారికే మెజార్టీ సీట్లు దక్కనున్నాయి. ఇక ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు దక్కే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా. ఒక్క స్థానానినికి 28 మంది సభ్యులను ప్రతిపాదికన తీసుకునే అవకాశం ఉంది. అయితే ఓటి...