భారతదేశం, మార్చి 7 -- రాష్ట్రంలో పని చేస్తున్న పలువురు ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. మొత్తం 21 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో అడిషనల్ డీజీతో పాటు ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డిఐజీలు ఉన్నారు.

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌గా గౌస్‌ ఆలం నియమితులయ్యారు. వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్, సంగారెడ్డి ఎస్పీగా పారితోష్ పంకజ్,నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య, రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా(ప్రస్తుతం వరంగల్ సీపీ)ను బదిలీ చేశారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....