తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 23 -- రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో మొత్తం ఎనిమిది మంది అధికారులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌ క్రైమ్స్‌ అదనపు కమిషనర్‌గా విశ్వప్రసాద్, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌గా జోయల్ డేవిస్‌ నియమితులయ్యారు. ఇక సైబరాబాద్‌ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా గజారావు భూపాల్ బాధ్యతలు చూడనున్నారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్, హైదరాబాద్‌ ఎస్బీ డీసీపీగా చైతన్యకుమార్‌ నియమితులయ్యారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....