భారతదేశం, జనవరి 2 -- తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. తల్లిదండ్రుల వాట్సప్ నెంబర్ కు విద్యార్థుల హాల్టికెట్లను పంపనున్నారు. హాల్టికెట్ నంబర్, పరీక్షా కేంద్రం చిరునామాతో పాటు ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుందో తల్లిదండ్రులకు తెలియజెప్పడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.
సెకండ్ ఇయర్ హాల్ టికెట్లలో ఫస్ట్ ఇయర్ మార్కుల లింక్ కూడా ఇస్తారు. ఫలితంగా సదరు విద్యార్థి ఫస్ట్ ఇయర్ లో తప్పిన(ఫెయిల్) పరీక్ష వివరాలు కూడా కనిపిస్తాయి. ఫలితంగా తల్లిదండ్రులకు కూడా ఓ అంచనా ఉండనుంది. ఈ నిర్ణయం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
ఇక హాల్ టికెట్లలో ఏమైనా తప్పులుంటే కాలేజీలను సంప్రదింవచ్చని కూడా ఇంటర్ బోర్డు సూచించింది. లేదా నోడల్ అధికారులను కూడా కలవొచ్చని పేర్కొంది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.