తెలంగాణ,హైదరాబాద్, మార్చి 12 -- ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే టీజీఐసెట్ - 2025 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మే 3 వరకు ఎలాంటి ఆపరాద రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 500 ఫైన్ తో మే 25 వరకు అవకాశం కల్పించారు.

ఈ ఏడాది ఐసెట్ ప్రవేశ పరీక్షను ఉన్నత విద్యామండలి తరపున మహాత్మ గాంధీ యూనివర్శిటీ (నల్గొండ) నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు మే 3 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. రూ. 250 రూపాయలు అపరాధ రుసుంతో మే 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ 500 రూపాయల అపరాధ రుసుముతో మే 26 వరకు అవకాశం కల్పించారు. మే 16 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. జూన్ 8,9 తేదీల్లో పరీక్షలను నిర్వహిస్తారు. సీబీటీ(కంప్యూటర్ బేస్డ్) విధానంలో ఎగ్జామ్స్ ఉంటాయి.

ఉదయం 10 గంటల నుంచ...