భారతదేశం, ఏప్రిల్ 8 -- TG High Court: దిల్‌ సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు 2016లో ఎన్‌ఐఏ కోర్టు మరణ శిక్ష విధించింది. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు ఖరారు చేసింది. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌‌లో జరిగిన బాంబు పేలుళ్లలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో భత్కల్, జియా ఉర్‌ రెహ్మాన్‌ , అజాజ్‌ షేక్‌, తహసిన్‌ భత్కల్‌లకు ఎన్‌ఐఏ హైకోర్టు గతంలోనే మరణశిక్ష విధించింది. తాజాగా కింద కోర్టు తీర్పును హైకోర్టు ఖరారు చేసింది. ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు.

2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట బాంబు పేలుళ్లలో 18మంది ప్రాణాలు కోల్పోయారు. 131మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్లకు సూత్రధారులుగా యాసిన్ భత్కల్‌, రియాజ్‌ భత్కల్‌లను ఎన్‌ఐఏ గుర్తించింది. ఏ1 రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడని ఎన్‌ఐఏ చెబుతోంది. మిగిలిన యాసిన్...