తెలంగాణ,హైదరాబాద్, మార్చి 13 -- రాష్ట్రంలో ఒంటిపూట బడులపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఏప్రిల్ 23వ తేదీ వరకు హాఫ్ డే స్కూల్స్ ఉంటాయని వివరించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది.

ఒంటిపూడ బడుల నేపథ్యంలో ఉదయం 8 గంటలకే స్కూళ్లు తెరుచుకుంటాయి. మధ్యాహ్నం 12. 30 గంటలకు వరకు పని చేస్తాయి. పదో తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లల్లో మధ్యాహ్నం 1. 00 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు తరగతులను నిర్వహిస్తారు. ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లలకు వేసవి సెలవులు రానున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్కూల్ పిల్లలు ఇబ్బంది పడకుండా కాస్త ముందుగానే ఒంటిపూట బడులు ఇచ్చే దిశగా ప...