తెలంగాణ,హైదరాబాద్, మార్చి 30 -- రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న కామన్ అడ్మిషన్(TG Gurukul CET - 2025) ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ఫలితాలు శనివారం రాత్రి అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి మెరిట్ జాబితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ ఎంట్రెన్స్ ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు సాధారణ గురుకులాల్లో (TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS, TGREIS) 5వ తరగతి అడ్మిషన్లు కల్పిస్తారు. 2025-26 విద్యాసంవత్సరానికి గాను ఈ ఉమ్మడి పరీక్ష నిర్వహించారు. ఇవే కాకుండా 6,7, 8,9 తరగతిలోని ఖాళీలను భర్తీ చేసేందుకు నిర్వహించిన ప్రవేశాల ఫలితాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక ఈ ఏడాది 50 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థి సాధించిన ర్యాంక్ ఆధారం...