తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 2 -- రాష్ట్రంలో దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్వయం ఉపాధి కోసం ప్రవేశ పెట్టిన సబ్సిడీ రుణాల నిధులను మంజూరు చేసింది. అర్హతలు ఉన్న వారిని ఎంపిక చేసి వందశాతం సబ్సిడీతో ఈ రుణాలను అందించనుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోనూ అర్హులను గుర్తించనున్నారు.
ఈ రుణాల కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 12వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అర్హులైన వారు ఈలోపే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ ద్వారా స్వీకరించే దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆ తర్వాత మండల స్థాయిలో ఎంపీడీవోలు చెక్ చేస్తారు. 1:3 నిష్పత్తిలో దరఖాస్తులను ఎంపిక చేసి జిల్లా అధికారులకు జాబితా పంపుతారు. అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఫైనల్ లిస్ట్ ను రూపొందిస్తారు. ఈ జాబితానే ఆన్ లైన్ లో ఉంచుతారు.
Publish...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.