Telangana,hyderabad, మే 7 -- ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ - 2025 పరీక్షలు ముగిశాయి. ముందుగా అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు పూర్తికాగా. ఆ వెంటనే ప్రిలిమినరీ కీలతో పాటు రెస్పాన్స్ షీట్లు అందుబాటులోకి వచ్చాయి. అభ్యంతరాలను కూడా స్వీకరించారు. మరోవైపు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్ పూర్తి కాగానే. ప్రాథమిక కీలతో పాటు రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి.

ఏప్రిల్ 29 నుంచి మే 4, 2025 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షల కీలపై అభ్యంతరాల ప్రక్రియ పూర్తిగా.. ప్రస్తుతం ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మే 7వ తేదీ సాయంత్రం 05:00 గంటలలోపు పూర్తవుత...