Telangana, జూన్ 8 -- చివరిగా వాకిటి శ్రీహరితో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. కొత్తగా ఎంపికైన వారికి గవర్నర్ పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.

వివేక్ తర్వాత అడ్లూరి లక్ష్మణ్ తో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు.

ముందుగా జి వివేక్ తో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు.

మధ్యాహ్నం 12.19 నిమిషాలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరగనుంది. మంత్రులుగా వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ ప్రమాణం చేయనున్నారు.

మరికొద్ది నిమిషాల్లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభం కానుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయించనున్నారు.

"మంత్రివర్గంలో చోటు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉంది. మా ఆరుగురు ప్రజాప్రతినిధులలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా నాకు సంతోషమ...