Telangana, జూన్ 8 -- ప్రస్తుతం కేబినెట్ లోకి వచ్చే ముగ్గురు కూడా తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచినవారే. వివేక్ గతంలో ఎంపీగా పని చేశారు. మొన్నటి ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

ప్రస్తుత కేబినెట్ విస్తరణలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లికి చోటు దక్కినట్లు ప్రచారం దక్కింది. కానీ చివర్లో ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అడ్లూరి లక్ష్మణ్ ను మంత్రి పదవి వరించింది.

ప్రస్తుత కేబినెట్ విస్తరణలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి చివరి వరకు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. చివరి నిమిషంలో ఆయనకు చోటు దక్కలేదు. ఇప్పటికే ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి కేబినెట్ లో ఉన్నారు.

ప్రస్తుత కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. ఇక్కడ్నుంచి పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేరు రేసులో ఉన్నారు.ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుం...