భారతదేశం, మార్చి 27 -- TG Assembly: జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం చెడిపోతుందని ఆనాడు ఇందిరా గాంధీ భావించారని అందుకే చట్టాన్ని సవరించి పునర్విభజన చేశారని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారుర.

నియోజక వర్గాల పునర్విభజన అంశం మళ్లీ చర్చకు రావడంతో దక్షిణాదిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, కేంద్రం జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేసేలా కేంద్రం వ్యవహరిస్తే ఖచ్చితంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. నియోజక వర్గాల పునర్విభజనపై అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేశాయని, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణా...