భారతదేశం, మార్చి 11 -- Terrorists attack train: నైరుతి పాకిస్తాన్ లో మంగళవారం ప్యాసింజర్ రైలుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో రైలు డ్రైవర్ గాయపడ్డాడు. అనంతరం, 9 బోగీల్లో సుమారు 450 మంది ప్రయాణికులున్న ఆ రైలును హైజాక్ చేశారు. ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

బలూచిస్థాన్ నైరుతి ప్రావిన్స్ లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్ కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలుపై ఉగ్రవాదులు దాడి చేశారు. సుమారు 450 మంది ప్రయాణికులున్న ఆ రైలును హైజాక్ చేశారు. అయితే, డ్రైవర్ తో పాటు ప్రయాణికులపై కూడా ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, టెర్రరిస్ట్ ల కాల్పుల్లో డ్రైవర్ గాయపడగా, పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. కాగా, సుమారు 100 మందికి పైగా ప్రయాణికులు, సెక్యూరిటీ సిబ్బందిని ఉగ్రవాదులు బందీ...