భారతదేశం, మార్చి 23 -- Telugu Serial: పాత సీరియ‌ల్స్‌కు ఒక్కొక్క‌టిగా గుడ్‌బై చెబుతోన్న ఈటీవీ ఒకేసారి ఏడు కొత్త సీరియ‌ల్స్‌తో బుల్లితెర ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతోంది. డివోష‌న‌ల్‌, ఫ్యామిలీ డ్రామా, ఫాంట‌సీ...ఇలా డిఫ‌రెంట్ జాన‌ర్స్‌తో ఈ సీరియ‌ల్ తెర‌కెక్కుతోన్నాయి. ఈ సీరియ‌ల్స్ టైటిల్స్ రివీల‌య్యాయి.

ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కుతోన్న వేయి శుభ‌ములు క‌లుగు నీకు సీరియ‌ల్ త్వ‌ర‌లో ఈటీవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సీరియ‌ల్‌లో మౌనిక‌రెడ్డి, శిల్పా చ‌క్ర‌వ‌ర్తి, వీజే సంయుక్త‌, శ్వేత, జ్యోతి గౌడ‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు.

వేయి శుభ‌ములు క‌లుగు నీకు సీరియ‌ల్ ప్రోమోను ఇటీవ‌ల‌ మేక‌ర్స్ రిలీజ్ చేశారు. వారాహి, క‌ళ్యాణి, హాసిని, సునైన అనే న‌లుగురు అక్కాచెలెళ్ల క‌థ‌తో ఈ సీరియ‌ల్ రూపొందుతోన్న‌ట్లు ఈ ప్రోమోలో చూపించారు. ఈ ప్ర...