Hyderabad, ఫిబ్రవరి 26 -- Only Two Or Three Actors Played Movies In Telugu: తెలుగు సినిమా అన్నాక ఎంతోమంది నటీనటులు ఉంటారు. కొన్నిసార్లు భారీ తారాగణం కూడా ఉంటుంది. అయితే, కొన్ని సినిమాలు మాత్రం కేవలం రెండు మూడు పాత్రలతోనే థియేటర్లలో విడుదలయ్యాయి. రెండు లేదా మూడు పాత్రలతో వచ్చిన తెలుగు సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

దివంగత స్టార్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎన్నో హిట్ సాంగ్స్‌ పాడి ఎనలేని కీర్తి గడించారు. గాయకుడిగా ఆయన్ను మించిన వారు లేరు అన్నంతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే, సీనియర్ నటి లక్ష్మి ఎన్నో సినిమాలతో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా, అత్తగా, తల్లిగా, బామ్మగా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి విశేష ఆదరణ పొందారు.

అలాంటి వీరిద్దరు కలిసి జోడీగా నటించిన సినిమా మిథునం. 2012లో విడుదలైన ఈ సినిమాలో కేవలం ఎస్పీ బాలు,...