భారతదేశం, ఫిబ్రవరి 3 -- తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు నోటీసులు జారీ అయ్యాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత రెండో పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.

పార్టీ ఫిరాయించిన ఏడుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని.. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ వేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని మొదట పిటిషన్‌ వేశారు. దీంతోపాటు రెండో పిటిషన్‌ను విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 10న మొదటి పిటిషన్ విచారణ జరిగే రోజే.. రెండో పిటిషన్‌పైనా విచారణ చేస్తామంట...