భారతదేశం, ఫిబ్రవరి 10 -- బీఆర్ఎస్ తరఫున గెలిచి.. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై.. అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఏడుగురు ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్‌ జాప్యం చేస్తున్నారంటూ.. కేటీఆర్‌ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ గవాయ్‌ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.

తెలంగాణ స్పీకర్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్‌లను కేటీఆర్‌ తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. సుప్రీంలో విచారణ సమయంలో.. అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.

స్పీకర్‌ నుంచి సమాచారం కోసం మరింత సమయం కావాలని ముకుల్ రోహత్గీ సుప్రీం ధర్మాసనా...