భారతదేశం, ఏప్రిల్ 15 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ క్లాస్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఒక్క ఎమ్మెల్యే కూడా సోషల్ మీడియా వాడటం లేదన్న రేవంత్.. ప్రభుత్వంపై నెగిటివ్‌ ప్రచారం చేస్తుంటే.. ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

'కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. వీకెండ్‌ రాజకీయాలు చేయొద్దు. మంత్రి పదవుల విషయం అధిష్ఠానం చూసుకుంటుంది. మీరు మాట్లాడేదంతా రికార్డవుతుంది. పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడొద్దు. కొందరి తీరు రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతోంది. సున్నితమైన అంశాలపై నోరు పారేసుకోవద్దు' అని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు సూచించారు.

'ప్రజాప్రభుత్వ సంక్షేమపథకాల...