భారతదేశం, మార్చి 4 -- ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పనితీరుపై సమీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గ స్థాయిలో పార్టీ పనితీరును తెలుసుకునేందుకు గాంధీభవన్లో 4వ తేదీ నుంచి సమీక్షలు నిర్వహించనున్నారు. తొలుత మంగళవారం మెదక్, మల్కాజిగిరి; బుధవారం కరీంనగర్, ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గాల నేతలందరితో సమీక్షించనున్నారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమీక్షలకు.. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర ముఖ్యనేతలందరూ రావాలని ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన తరవాత.. నిర్వహించబోతున్న తొలి సమీక్ష సమావేశాలు కావడంతో వీటికి ప్రాధాన్యం ఏర్పడింది.
అటు గాంధీభవన్కు చాలామంది నేతలు క్యూకడుతున్నారు. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.