భారతదేశం, మార్చి 21 -- రైతులందరికీ రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కను చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తున్నా.. అని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. నది దాటేదాక ఓడ మల్లయ్య.. దాటిన తరువాత బోడ మల్లయ్య అనే సామెత కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా వర్తిస్తుందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల పాలనలో ఒక్క రూపాయి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయలేదని వ్యాఖ్యానించారు.

'కరోనా కాలంలోనూ మేం ఫీజు రూ.18,500 కోట్లు రీయింబర్స్‌మెంట్ ఇచ్చాం. సంస్కారానికి ఆస్కార్ అవార్డు ఉంటే అది రేవంత్ రెడ్డికే వస్తది. రేవంత్ రెడ్డి ప్రసంగం మార్చురీ కంపు కొడుతోంది. ప్రజలు వినలేకపోతున్నారు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్‌గా మారింది. జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడిగితే అశోక్ నగర్‌లో నిరుద్యోగుల వీపులు...