భారతదేశం, ఫిబ్రవరి 22 -- రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకమండళ్లు కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇటీవలనే ఎన్నికలు పూర్తి కాగా. సర్పంచ్ లు, ఉపసర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. తాజాగా వారికి శిక్షణ తరగతులను కూడా నిర్వహిస్తున్నారు.

ఇక రాష్ట్రంలో కొత్త పాలకమండళ్లు కొలువుదీరటంతో పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయిపోయింది. ఇటీవలనే తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం రూ. 259.36 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మరోసారి కేంద్రం తీపి కబురు చెప్పింది. రెండో విడత కింద నిధులను విడుదల చేసింది.

కేంద్రం ప్రభుత్వం రెండో విడతగా దాదాపు రూ. 387 కోట్లను విడుదల చేసింది. తొలి విడతగా ఇప్పటికే దాదాపు రూ. 260 కోట్లు విడుదల చేయగా.. మొత్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు తెలంగాణ గ్రామ పంచాయతీల కోసం రూ. 647 కోట్ల న...