భారతదేశం, మార్చి 4 -- ఆంధ్రప్రదేశ్‌లో విజయం తర్వాత తెలుగుదేశం పార్టీ కేడర్ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో పార్టీని యాక్టివ్ చేయాలని ఇక్కడి నేతలు చాలా రోజులుగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరో 10 నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై టీడీపీ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభం అయినట్టు తెలుస్తోంది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేసిన పొలిటికల్ కన్సల్టెన్సీ 'షోటైమ్'.. ఇప్పుడు హైదరాబాద్‌లో కార్యాకలాపాలు ప్రారంభించింది.

హైదరాబాద్‌లో ఆఫీసు ఏర్పాటు చేసిన షోటైమ్ ప్రతిని...