భారతదేశం, మార్చి 29 -- తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. చంద్రబాబు నాయుడు ఎమోషనల్ పోస్ట్ చేశారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు. 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ.. తెలుగుదేశం అని వ్యాఖ్యానించారు. అన్న నందమూరి తారకరామారావు దివ్య ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం.. దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణం అని కొనియాడారు.

'పీకపై కత్తిపెట్టినా జై తెలుగుదేశం నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, తెలుగు వారిని అభివృద్ధి పథాన నడిపించిన జెండా, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిన జెండా, తెలుగు వారికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఇచ్చిన జెండా, ...