భారతదేశం, ఏప్రిల్ 25 -- Suryapet Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు Fatal accident ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న కారు, జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో కారులో ఉన్నSix killed ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై లారీ బ్రేక్ డౌన్ break down కావడంతో దానిని డ్రైవర్‌ రోడ్డుపైనే నిలిపి ఉంచాడు.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళుతున్న ఎక్స్‌ఎల్‌ 6 వాహనంలో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. మితిమీరిన వేగంతో ప్రయాణించిన కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అందులో ఉన్న ప్రయాణికుల్లో ఆరుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

రెండు రోజుల క్రితం సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త జంట ప్రాణాలు కోల్పోయింది. సూర్యాపేట జిల్లా మునగాల మం...