భారతదేశం, ఏప్రిల్ 7 -- Stray Dog Attack: గుంటూరులో వీధి కుక్క నాలుగేళ్ల బాలుడిని నోట కరుచుకు పోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు తల్లడిల్లి పోయారు.

గుంటూరు నగరంలోని నల్లపాడు పోలీస్టేషన్ పరిధిలో ఆదివారం వీధి కుక్క నాలుగేళ్ల బాలుడిపై దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. నగర శివారులోని అడవి తక్కెళ్లపాడు పరిథిలోని స్వర్ణభారత్‌ నగర్‌కు చెందిన కె. నాగరాజు, రాణిమెర్సి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

వీరిలో చివరి వాడు నాలుగేళ్ల ఐజక్‌. ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు ప్రార్ధనల కోసం వెళుతూ తమతో పాటు ఐజక్‌ను కూడా తమతో తీసుకెళ్లారు. తల్లిదండ్రులు ప్రార్థనల్లో ఉన్న సమయంలో బాలుడు మూత్రవిసర్జన కోసం బయటకు రావడంతో అక్కడున్న వీధి కుక్క దాడిచేసింది.

బాలుడి మెడ పట్టుకుని కొంతదూరం ఈడ్చు కెళ్లింది. అక్క...