భారతదేశం, అక్టోబర్ 7 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 583 పాయింట్లు పెరిగి 81,790 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 183 పాయింట్లు వృద్ధిచెంది 25,078 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 516 పాయింట్లు పెరిగి 56,104 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 313.77 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5036.39 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ అక్టోబర్​​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 3,502.34 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8,442.29 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 30...