భారతదేశం, అక్టోబర్ 3 -- విజయ దశమి నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​లకు గురువారం సెలువ. ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 716 పాయింట్లు పెరిగి 80,983 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 225 పాయింట్లు వృద్ధిచెంది 24,836 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 712 పాయింట్లు పెరిగి 55,348 వద్దకు చేరింది.

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,605.12 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,916.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 24,700-24,800 దగ్గర బలమైన బేస్​ కనిపిస్తోంది. 25,000 వద్ద రెసిస్టెన్స్​ క...