భారతదేశం, మే 3 -- Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 128 పాయింట్లు పెరిగి 74,611 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 43 పాయింట్లు పెరిగి 22,648 వద్ద ముగిసింది. ఇక 166 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్​ నిఫ్టీ.. 49,231 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీలో రేంజ్​ బౌండ్​ యాక్షన్​ కనిపించే అవకాశం ఉంది. 22,800 లెవల్స్​ దగ్గర రెసిస్టెన్స్​ ఉంది. 22,550 దగ్గర సపోర్ట్​ ఉందని.. హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 965 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1352 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

Stock market news to...