భారతదేశం, ఏప్రిల్ 11 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లకు గురువారం సెలవు. ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు నష్టపోయాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 380 పాయింట్లు పడి 73,847 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 137 పాయింట్లు కోల్పోయి 22,399 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 271 పాయింట్లు పడి 50,240 వద్దకు చేరింది.

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,358.02 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,976.66 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 460 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"22,500 కింద నిఫ్టీ50 కొనసాగినంత కాలం వీక్​నెస్​ కనిపిస్తుంది. 22,700- 22,800 లెవల్స్​ దాటితే కాస్త పాజిటివ్​గా మారొ...