భారతదేశం, జూలై 15 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 247 పాయింట్లు పడి 82,253 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 68 పాయింట్లు పడి 25,082 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 11 పాయింట్లు పెరిగి 56,765 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,614.32 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,787.68 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 24,900- 24,950 లెవల్స్​ కీలక సపోర్ట్​గా ఉననాయి. అది బ్రేక్ ​అవ్వకపోతే నిఫ్టీ50 సూచీ 25,350 వరకు వెళ్లొచ్చు. బ్రేక్​ అయితే మరిం...