భారతదేశం, ఏప్రిల్ 2 -- Stock market today: బ్యాంకింగ్, ఐటీ షేర్లు పుంజుకోవడంతో ఏప్రిల్ 2న నిఫ్టీ, సెన్సెక్స్ బలమైన లాభాలతో సెషన్ ను ముగించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 టారిఫ్ గడువుకు ముందు ఈ ర్యాలీ చోటు చేసుకోవడం గమనార్హం. ఏప్రిల్ 2, 2025 బుధవారం సెన్సెక్స్ 593 పాయింట్లు లాభపడి 76,617.44 వద్ద, నిఫ్టీ 166.65 పాయింట్లు లేదా 0.72 శాతం పెరిగి 23,332.35 వద్ద ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 1.6 శాతం, స్మాల్ క్యాప్ 100 సూచీ 1.1 శాతం లాభపడటంతో విస్తృత మార్కెట్ కూడా సానుకూల సెంటిమెంట్ కు అద్దం పట్టింది.

అన్ని రంగాలు ఏప్రిల్ 2న ఆకుపచ్చ రంగులో ముగిశాయి. నిఫ్టీ రియల్టీ 3.6 శాతం లాభపడగా, నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 2.5 శాతం లాభపడింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1 శాతం చొప్పున పెరిగాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్షియల్ ...