భారతదేశం, నవంబర్ 29 -- Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 120పాయింట్లు పెరిగి 62,624 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​సీ నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 18,598 వద్ద ట్రేడ్​ అవుతోంది.

దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో నూతన శిఖరాలకు చేరుకున్నాయి. రిలయన్స్​ షేర్లు ఇచ్చిన జోష్​తో.. నిఫ్టీ50.. ఆల్​టైమ్​ హైని తాకింది. చివరికి 50 పాయింట్లు లాభపడి 18,562 వద్ద ముగిసింది. ఇక బీఎస్​ఈ సెన్సెక్స్​.. 211 పాయింట్లు వృద్ధిచెంది 62,505 వద్ద స్థిరపడింది. 2023 డిసెంబర్​ నాటికి సెన్సెక్స్​ 80,000 మార్క్​కు చేరుతుందని ప్రముఖ బ్రోకరేజ్​ సంస్థ మోర్గాన్​ స్టాన్​లీ అభిప్రాయపడింది. ఇక మంగళవారం సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 62,362- 18,553 వద్ద మొదలుపెట్టాయి....