భారతదేశం, డిసెంబర్ 6 -- Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 277 పాయింట్లు కోల్పోయి 62,558వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50.. 77 పాయింట్ల నష్టంతో 18,625 వద్ద ట్రేడ్​ అవుతోంది.

దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో తీవ్ర ఒడుదొడుకులకు లోనై.. చివరికి ఫ్లాట్​గా ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 34 పాయింట్ల నష్టంతో 62,835 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 18,701 వద్ద ముగిసింది. ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 62396- 18601 వద్ద మొదలుపెట్టాయి.

పివోట్​ ఛార్ట్స్​ ప్రకారం.. నిఫ్టీ సపోర్ట్​ 18,621- 18,589 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​ 18,726- 18,758 వద్ద ఉంది.

ఎన్​టీపీసీ, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఎయిర్​టెల్​, ...