భారతదేశం, మార్చి 7 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 610 పాయింట్లు పెరిగి 74,340 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 207 పాయింట్లు వృద్ధచెంది 22,545 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 138 పాయింట్లు పెరిగి 48,627 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2377.32 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,617.8 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

మార్చ్​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 13,466.47 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 18,630.53 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 65 పాయింట్ల ...